Home  »  TV News  »  Eto Vellipoyindhi Manasu : అడుగడుగునా యాగానికి అడ్డంకులే.. భార్యాభర్తలు కలిసి పూర్తిచేయగలరా!

Updated : Sep 18, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -203 లో...... రామలక్ష్మి మోకాళ్ళ పై ప్రదక్షిణలు చేస్తుంటే అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఇలా పీడ కల వచ్చింది అందుకే ఇలా చేస్తే మంచి జరుగుతుందని, ప్లీజ్ ఆపకండి అని రామలక్ష్మి అంటుంది. ఏం చేసిన మీ గురించి కదా బాబు ఆపకండి అని సుజాత అనగానే.. సరే అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి ప్రదక్షిణ పూర్తి చేస్తుంది. శ్రీవల్లి తన ముందు కొబ్బరి చిప్పలు వేస్తుంది దానిపై కాలు వెయ్యడంతో గుచ్చుకొని రక్తం వస్తుంది.

అది చూసి సీతాకాంత్ కంగారుపడుతూ పక్కన కూర్చొపెట్టి పసుపు పెడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు పంతులు దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి, ఇది కింద పడకుండా తీసుకొని వెళ్లి యాగం లో ఉపయోగించండి అని అంటాడు. దాంతో రామలక్ష్మి వాటిని జాగ్రత్తగా తీసుకొని వెళ్తుంది. ఎలాగైనా అవి పడేయాలని శ్రీవల్లి అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సీతాకాంత్ ఆపి కొంచెం మెల్లిగా రమ్మని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి నడుస్తుంటే తన కాలు అడ్డం పెడుతుంది. కాని శ్రీవల్లినే కింద పడిపోతుంది. ఆ తర్వాత రామాలక్ష్మిపై ఎలా ఎటాక్ చెయ్యాలి అని రౌడీ ఆలోచిస్తుంటే అప్పుడే తన పట్టి కింద పడిపోవడం రౌడీ చూస్తాడు. అది తన చేతిలోకి తీసుకుంటాడు ఆ తర్వాత రామలక్ష్మి తన పట్టి లేదని చూసుకొని ఎక్కడో పడిపోయింది చూస్తానని రామలక్ష్మి వెళ్తుంది. మరొకవైపు ఆగిపోయే యాగానికి నువు ఎందుకు హడావిడి చేస్తున్నావని శ్రీలతతో సందీప్ అంటాడు. ఇలా చేస్తే మనపై డౌట్ రాదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి స్వామి వేషమ్ లో ఉన్న రౌడీ దగ్గరికి వస్తుంది. తన పట్టి చూసి తీసుకుంటుంది. అప్పుడే రౌడీ కత్తి తియ్యబోతుంటే సీతాకాంత్ వాళ్లు వస్తారు.

ఆ తర్వాత అందరు యాగం దగ్గర సకల వస్తారు. రామలక్ష్మి సీతాకాంత్ లు కలిసి రావడం చూసి వాళ్ళు వస్తున్నారని ఆశ్చర్యంగా శ్రీలత సందీప్ లు చూస్తారు. ఆ తర్వాత ఈ యాగాన్ని ఆపడానికి నేను ట్రై చేసాను కానీ వర్కవుట్ కాలేదని వాళ్ళతో శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత యాగం దగ్గర పనులు చేస్తుంటే.. నీ లాంటి చెడు ఆలోచనలున్న వాళ్లు ముట్టుకోవద్దని మాణిక్యం అంటాడు. అప్పుడే అందరు వస్తారు. మీ నాన్న అత్తయ్యని ఇలా అన్నాడని రామలక్ష్మికి శ్రీవల్లి చెప్తుంది. ఏదో తెలియక అన్నాడని సుజాత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.